14 ఏళ్ల తర్వాత దళపతి విజయ్ సరసన త్రిష.. కన్ఫర్మ్ చేసిన టీమ్

-

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష- ఇళయదళపతి విజయ్ దాదాపు 14 ఏళ్ల తర్వాత కలిసి నటించనున్నారు.  ‘దళపతి 67’  (వర్కింగ్‌ టైటిల్‌) కోసం త్రిష రంగంలోకి దిగింది. దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న వారి వివరాలను మంగళవారం ప్రకటించిన చిత్రబృందం ఇప్పుడు కథానాయికగా త్రిష నటిస్తోందని వెల్లడించింది.

ఆన్‌ స్క్రీన్‌పై విజయ్‌- త్రిష జోడీకు మంచి క్రేజ్‌ ఉంది. 2004లో వచ్చిన ‘ఘిల్లి’ (తెలుగు సినిమా ఒక్కడు రీమేక్‌)లో వారిద్దరు తొలిసారి కలిసి నటించారు. మరుసటి ఏడాది ‘తిరుపాచి’లో, 2006లో ‘ఆది’ (తెలుగు సినిమా అతనొక్కడే రీమేక్‌), 2008లో వచ్చిన ‘కురువి’లో మెరిశారు. సుమారు 14 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్నారు.

‘ఖైదీ’, ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’ చిత్రాలతో టాలీవుడ్‌లోనూ విశేష గుర్తింపు పొందారు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌. తన మల్టీవర్స్‌లో ‘దళపతి 67’ను భాగం చేస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌, అర్జున్‌, గౌతమ్‌ మేనన్‌, ప్రియా ఆనంద్‌ తదితర ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తుండడంతో ఈ సినిమాపై సినీ ప్రియుల్లో అంచనాలు అప్పుడే మొదలయ్యాయి. జనవరి 2న ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news