హీరోలే కాదు 2022 వరకు త్రివిక్రం డైరీ కూడా ఖాళీ లేదట ..!

-

ఈ ఏడాది ప్రారంభంలోనే అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఇపటివరకు త్రివిక్రం తెరకెక్కించిన సినిమాలన్నిటి కంటే అల వైకుంఠపురములో సినిమా హైయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ సృష్ఠించింది. అంతేకాదు అల్లు అర్జున్ కెరీర్ లో కూడా ఈ సినిమా రికార్డ్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రం ఎన్.టి.ఆర్ 30 వ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అన్న టైటిల్ తో ఈ సినిమాతో తెరక్కబోతుంది.

ఈ సినిమా తర్వాత త్రివిక్రం మరో రెండు సినిమాలు కూడా ఫైనల్ అయినట్టు తాజా సమాచారం. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ బాలీవుడ్ హిట్ సినిమా పింక్ రీమేక్ లో నటిస్తున్నారు. వకీల్ సాబ్ పేరుతో దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తుండగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తో పాటే పవన్ కళ్యాణ్ క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ తో ఒక సినిమా చేయనున్నారు పవన్ కళ్యాణ్.

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ త్రివిక్రం సినిమా చేస్తారని సమాచారం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వచ్చాయి. వాటిలో మొదటి రెండు సినిమాలు సూపర్ హిట్ అవగా అజ్ఞాతవాసి మాత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది. అందుకే ఆ లోటుని భర్తీ చేయడానికే త్రివిక్రం పవన్ కళ్యాణ్ కోసం ఒక కథ ని రెడీ చేస్తున్నారట. అలాగే మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక కథ రాస్తున్నారు త్రివిక్రం. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుజీత్ దర్శకత్వంలో లూసీఫర్ రీమేక్, తర్వాత బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారు. ఆతర్వాత త్రివిక్రం దర్శకత్వ లో నటిస్తారట. మొత్తానికి హీరోల మాదిరిగానే త్రివిక్రం కూడా మెగా బ్రదర్స్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ 2022 వరకు ఖాళీ లేదని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news