అఖిల్ కోసం ఎన్టీఆర్

-

అక్కినేని అఖిల్ మూడవ సినిమా మిస్టర్ మజ్ను వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న విషయం తెలిసిందే. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నెల 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 19న ఫిక్స్ చేశారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ వస్తున్నట్టు తెలుస్తుంది. హీరోగా అఖిల్ కు ఇది మూడవ సినిమా ఇంకా బాక్సాఫీస్ విజయాన్ని సొంతం చేసుకోని అఖిల్ రాబోతున్న మిస్టర్ మజ్ను మీద భారీ హోప్స్ పెట్టుకున్నాడు.

తొలిప్రేమ సినిమాతో మొదటి సినిమాతోనే సత్తా చాటిన వెంకీ అట్లూరి ద్వితీయ ప్రయత్నంగా మిస్టర్ మజ్ ను వస్తుంది. సినిమా ఎక్కువశాతం యూరప్ లోనే షూట్ చేశారు. ఈమధ్యనే రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తమన్ మ్యూజిక్ మరోసారి మ్యాజిక్ చేయడం గ్యారెంటీ అనిపించేలా ఉంది. మరి అఖిల్ కు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news