మహానాయకుడు అందరికి ఫ్రీ..!

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ గా వచ్చిన మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు మొదటి రోజు టాక్ పర్వాలేదు అన్నట్టుగా వచ్చినా వసూళ్లు మాత్రం రోజు రోజుకి తగ్గుతూ వచ్చాయి. 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చిన కథానాయకుడు మూవీ బయ్యర్లకు భారీ నష్టాలు తెచ్చేలా ఉంది. అందుకే కథానాయకుడు నష్టాలను మహానాయకుడితో కవర్ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ కథానాయకుడు కొన్న బయ్యర్లకే మహానాయకుడు సినిమా ఫ్రీగా ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారట.

క్రిష్ డైరక్షన్ లో నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో తెరకెక్కిన ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా మొదటి పార్ట్ ఏమాత్రం మ్యాజిక్ చేయలేకపోయింది. ఎలాంటి గొడవలు లేని మొదటి పార్ట్ ఇలాంటి ఫలితాన్ని అందుకుంటే ఇక రెండో పార్ట్ ఎలా ఉండబోతుందో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అన్న చర్చ మొదలైంది. ఫిబ్రవరి 7న ఎన్.టి.ఆర్ మహానాయకుడు సినిమా వస్తుంది. మరోపక్క ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా రాం గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఈ నెల 24న రిలీజ్ ఫిక్స్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news