వినయ విధేయ రామ కోసం ఎన్టీఆర్..!

-

రంగస్థలం తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న సినిమా వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్నారు. 2019 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల చివర్లో వైజాగ్ లో జరుపనున్నారు. ఈ ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ స్పెషల్ గెస్ట్ గా వస్తున్నాడని తెలుస్తుంది.

ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి రాజమౌళి ట్రిపుల్ ఆర్ లో నటిస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఈ సినిమాలో ఇద్దరు సూపర్ స్టార్స్ నటించడం విశేషం. ఇక ఇప్పుడు వినయ విధేయ రామ సినిమా కోసం ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వచ్చి తమ మధ్య ఉన్న క్లోజ్ నెస్ ను అందరికి తెలిసేలా చేస్తున్నారు.

ట్రిపుల్ ఆర్ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకోగా. కొద్దిగా గ్యాప్ ఇచ్చి మరో షెడ్యూల్ త్వరలో స్టార్ట్ చేస్తారట. రాం చరణ్ వి.వి.ఆర్ మాత్రం ఓ సాంగ్ షూట్ చేయాల్సి ఉందట.

Read more RELATED
Recommended to you

Latest news