తమిళ దర్శకుడు అట్లీ తో ఎన్.టి.ఆర్ లేటెస్ట్ సినిమా …!

-

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ లు హీరోలుగా ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమా రౌద్రం రణం రుథిరం. అల్లూరి సీతారామరాజు గా చరణ్, కొమరం భీం గా తారక్ నటిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా సినిమాని డి వి వి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద డి వి వి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

 

ఇక ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ మాటల మాంత్రీకుడు త్రివిక్రం దర్శకత్వంలో అయినను పోయిరావలె హస్తినకు అన్న సినిమా చేయబోతున్నాడు. ఎన్.టి.ఆర్ 30 గా రూపొందబోయో ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. త్రివిక్రం తో సెట్ లోకి ఎంటరయ్యాక నాన్ స్టాప్ గా ఈ సినిమాని కంప్లీట్ చేసే విధంగా ప్లాన్స్ వేస్తున్నారట చిత్ర యూనిట్.

త్రివిక్రం తర్వాత ఎన్.టి.ఆర్ నటించబోయో సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఒకవేళ ఈ సినిమా గనక డిలే అయితే ఎన్.టి.ఆర్ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో నటించే అవకాశాలున్నాయని అంటున్నారు. అట్లీ ఇప్పటికే తమిళ్ లో స్టార్స్ తో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ ని ఇచ్చాడు. ఇక ఇప్పటికే ఎన్.టి.ఆర్ అట్లీ కాంబినేషన్ లో సినిమా గురించి ఇండస్ట్రీ తో పాటు ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news