మహేష్ కోసం ఎన్టీఆర్, రాం చరణ్.. ఒకే వేదికపై ముగ్గురు స్టార్స్..!

-

ఎన్.టి.ఆర్, చరణ్ స్నేహం గురించి తెలిసిందే. సినిమాలతో పోటీ పడినా ఇద్దరు తమ ఫ్రెండ్ షిప్ తో ఫ్యాన్స్ ను ఖుషి చేస్తారు. ఇక మరోపక్క చరణ్, మహేష్ కూడా అదపాదడపా కలుస్తూనే ఉంటారు. ఎన్.టి.ఆర్, మహేష్, చరణ్ లు ఈమధ్య బాగా క్లోజ్ అయ్యారు. సిని వేడుకలకు వీరి కలయిక స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. ఇప్పటికే మహేష్ భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్.టి.ఆర్ గెస్ట్ గా వచ్చాడు.

ఇక ఇప్పుడు మరోసారి మహేష్ కు గెస్టులుగా స్టార్స్ వస్తున్నారట. మే 9న రిలీజ్ ప్లాన్ చేసిన మహర్షి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1న జరుగనుంది. ఈసారి ఎన్.టి.ఆర్ తో పాటుగా రాం చరణ్ కూడా మహర్షి ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వస్తున్నాడని తెలుస్తుంది. మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఫ్యాన్స్ అందరికి ఈ ఈవెంట్ స్పెషల్ కానుంది. ఈ ముగ్గురు స్టార్స్ ఒకే వేదికపై కనిపిస్తే చూసేందుకు రెండు కళ్లు చాలవని చెప్పొచ్చు. ఎలాగు ఆర్.ఆర్.ఆర్ లో చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్నారు. మరే దర్శకుడైనా ఈ ముగ్గురిని పెట్టి సినిమా కథ రాస్తే బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news