మరోసారి చిరంజీవి పై సెటైరికల్ కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!

-

తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం భోళా శంకర్.. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటించగా.. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లి క్యారెక్టర్ లో మెప్పించింది. ఇక ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదలయ్యి .. బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకోగా.. డైరెక్టర్ మెహర్ రమేష్ ను నెటిజెన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా చిరంజీవి భోళా శంకర్ ఫ్లాప్ అయినప్పటికీ కూడా భారీగానే పారితోషకం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై అటు డైరెక్టర్ కానీ ఇటు చిరంజీవి కానీ అటు నిర్మాత కానీ ఎవరు అధికారికంగా స్పందించలేదు.

అయితే ఎవరికి నచ్చినట్టు వారు కథనాలను సృష్టించి అటు చిరంజీవిని బ్యాడ్ చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చిరంజీవిపై శ్రీ రెడ్డి కూడా సెటైరికల్ కామెంట్లు చేయడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది.. శ్రీ రెడ్డి తన ట్విట్టర్ వేదికగా..” భోళా శంకర్ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యాక చిరు అభిమానులు ఏం అంటున్నారంటే.. పాపం మెహర్ రమేష్ ని.. మరల డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి ఇలా డైరెక్టర్ల జీవితాలు మార్చడానికి ఒక సహాయం లాగా చిరంజీవి చేశారు.. మా చిరంజీవిది చాలా మంచి మనసు అంటున్నారు.

మరి అలాంటప్పుడు సినిమా చేయడానికి రూ.50 కోట్లు తీసుకోవడం ఎందుకు.. తక్కువ తీసుకుంటే నిర్మాత జీవితాలు కూడా బాగుంటాయి కదా “.. అంటూ తనదైన స్టైల్ లో ట్వీట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. ఇది చూసిన పవన్ కళ్యాణ్, చిరంజీవి అభిమానులు కూడా పూర్తిస్థాయిలో ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి దీనిపై చిరంజీవి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news