క్రిష్ ఆలోచనని వద్దన్న పవన్…!

-

చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అన్న వార్త pk అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. కొంత కాలం గా రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమా షూటింగ్ లతో బిజీ కానున్నారు. ఈ నెల 16 నుంచి క్రిష్ దర్శకత్వంలో మూవీ స్టార్ట్ అవుతుంది. 100 కోట్ల భారీ బడ్జెట్ ను ఈ సినిమాకు అనుకున్నారు. తొలుత దర్శక నిర్మాతలు,

దర్శకుడు క్రిష్ కు బాలీవుడ్ లో గుర్తింపు ఉండడంతో పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం నిర్మించాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు నిర్ణయాన్ని విరమించుకున్నారు. పాన్ ఇండియా ప్లాన్ వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది. బడ్జెట్ కూడా భారీగానే ఉన్నా ఈ చిత్రాన్ని తెలుగులో మాత్రమే తీయాలని చూస్తున్నాడు క్రిష్. తెలుగులో తీసి ఆ తర్వాత దీన్ని మిగిలిన భాష‌ల్లో అనువదించాలని ప్లాన్ చేస్తున్నారు.

హిందీలో కూడా ఇదే చేయాలనుకుంటున్నారు. పాన్ ఇండియా సినిమాలు ఈ మ‌ధ్య వరుసగా బోల్తా ప‌డుతున్నాయి. ఇది కూడా వెనక్కి తగ్గడానిక ఒక కారణం కావచ్చు. బాహుబలి తర్వాత పలు భాషల్లో రిలీజ్ అయిన సాహో, సైరా సినిమాలు పాన్ ఇండియా కు కలిసిరాలేదు. కాబట్టి ఎలాంటి రిస్క్ చేయకుండా ఒక్క భాషలోనే సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news