Pawan Kalyan: మరో రీమేక్ చేస్తున్న పవన్ కల్యాణ్..స్టార్ రైటర్‌కు ఈ సారి ఆ బాధ్యతలు!

-

జనసేనాని పవన్ కల్యాణ్ ప్రజెంట్ ఓ వైపు సినిమాలు మరో వైపు రాజకీయం రెండూ చేస్తున్నారు. ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొంటున్న పవర్ స్టార్..ఇది ఫినిష్ కాగానే ‘భవదీయుడు భగత్ సింగ్’ షూటింగ్ షురూ చేయనున్నారు. కాగా, ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్ ప్రకారం..పవన్ మరో రీమేక్ చేయబోతున్నారట.

ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించడంతో పాటు నటించిన ‘వినోదయ సిత్తం’ పిక్చర్ ను తెలుగులో రీమేక్ చేయాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారట. జనసేనాని రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చేస్తున్న సినిమాల్లో ఇప్పటి వరకు విడుదలైన రెండు చిత్రాలూ రీమేక్స్ కావడం గమనార్హం. ‘వకీల్ సాబ్, భీమ్లా నాయక్’ రెండు పిక్చర్స్ కూడా రీమేక్స్.

‘భీమ్లా నాయక్’ రీమేక్ బాధ్యతను పవన్ కల్యాణ్ ఫ్రెండ్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్నారు. స్క్రీన్ ప్లే తో పాటు మార్పులు చేర్పులు చేసి, డైలాగ్స్ రాసి..‘భీమ్లానాయక్’ను ప్రేక్షకులకు అందించారు. అలా ఈ సారి ‘వినోదయ సిత్తం’ పిక్చర్ రీమేక్ స్క్రిప్ట్ బాధ్యతలను స్టార్ రైటర్ బుర్రా సాయి మాధవ్‌కు అప్పగించినట్లు టాక్.

బుర్రా సాయి మాధవ్ ప్రస్తుతం పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాకు డైలాగ్స్ రాస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకే ఈ బాధ్యతలు అప్పగించారని టాక్. ఇకపోతే ఈ రీమేక్ కు కూడా ఒరిజనల్ కు దర్శకత్వం వహించిన నటుడు సముద్రఖనియే దర్శకత్వం వహించనున్నారని వినికిడి. అయితే, ఈ విషయమై అధికారిక ప్రకటన అయితే ఇంకా రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news