సత్యాగ్రహి నోరు విప్పాడు..!

-

పవర్ స్టార్ గా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న పవన్ కళ్యాణ్ జనసేన అంటూ రాజకీయాల్లోకి అడుగులు వేశారు. మన పర బేధం లేకుండా తనకు మంచి అనిపించిన దాని గురించి మంచిగా.. చెడు అనిపించిన దాని గురించి చెడుగా మాట్లాడుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఈసారి ఏపి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ప్రస్తుతం యూఎస్ టూర్ లో ఉన్న పవన్ కళ్యాణ్ జాతిని స్పూర్తి నింపేలా తన ప్రసంగాలను ఇస్తున్నారు.

ఇక సినిమాల గురించి ప్రస్థావించిన పవన్ కళ్యాణ్ అప్పట్లో చేద్దామనుకున్న సత్యాగ్రహి సినిమా గురించి నోరు విప్పారు. జానీ తర్వాత తాను రాసుకున్న సత్యాగ్రహి సినిమా తెరకెక్కించాలని అనుకున్నాడు పవన్ కళ్యాణ్, సత్యాగ్రహి అని ఎనౌన్స్ మెంట్ వచ్చి.. టైటిల్ పోస్టర్ కూడా వదిలారు. కాని ఆ సినిమా అటకెక్కింది. ఏ.ఎం రత్నం నిర్మించాలనుకున్న ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది.

సమాజంలో సమస్యల మీద చైతన్య కలిగించాలనే ఉద్దేశంతో ఆ కథ రాసుకున్నానని.. కాని సమాజంలో సమస్యలు సినిమాలో చూపించినా లాభం ఉండదని ఆ సినిమా క్యాన్సిల్ చేసుకున్నామని అన్నారు పవన్ కళ్యాణ్. మరి ఇప్పుడు శంకర్, మురుగదాస్ లాంటి వారు అలాంటి కథతోనే హిట్లు కొడుతున్నారు. సమాజంలో జరిగే అన్యాలు చూపిస్తే కాస్త కూస్తో జనాలు మారే అవకాశం ఉంటుంది. మరి పవన్ ఎలా ఈ లాజిక్ మిస్సయ్యాడో కాని సత్యాగ్రహి సినిమా వస్తే మాత్రం బాగుండేదని అనుకుంటున్నారు పవన్ ఫ్యాన్స్.

Read more RELATED
Recommended to you

Latest news