పవన్ ఫొటో పోస్ట్ చేసిన రేణు దేశాయ్, ఏమన్నారంటే…!

-

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2000వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన బద్రి సినిమా అప్పట్లో అద్భుత విజయాన్నిఆ అందుకుని హీరో పవన్ కు, దర్శకుడు పూరికి మంచి పేరు తీసుకువచ్చింది. ఇక అదే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ ని ప్రేమించిన పవన్ కళ్యాణ్, ఆ తరువాత 2009లో ఆమెను అధికారికంగా వివాహం చేసుకున్నారు. అయితే మూడేళ్ళ కాపురం తరువాత 2012లో ఆమె నుండి విడిపోయిన పవన్, ఇటీవల అన్న లెజెనోవాని మరొక వివాహం చేసుకోవడం జరిగింది.

అయితే పవన్, నేను భార్యా భర్తలుగా విడిపోయినప్పటికీ మా మధ్య మంచి స్నేహం మాత్రం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని రేణు తరచు చెప్తూ ఉంటారు. ఇక తన పిల్లలైన అకీరా, ఆద్యలను ఎంతో ప్రేమించే రేణు, ఎప్పటికప్పుడు వారికి సంబందించిన విషయాలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇక ఇటీవల తన కూతురు ఆద్యను, కొడుకు అకీరా ఎత్తుకుని ముద్దాడుతున్న ఫోటోని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన రేణు, నేడు నూతన సంవత్సరం సందర్భంగా కూతరు ఆద్యతో కలిసి పవన్ కళ్యాణ్ ప్రేమగా దిగిన ఫోటోని పోస్ట్ చేయడం జరిగింది.

 

నూతన సంవత్సరం సందర్భంగా పిల్లలతో సరదాగా గడపడం కోసం పవన్ వారి వచ్చినట్లు ఆ ఫోటోని బట్టి చూస్తే తెలుస్తోంది. అయితే ఆద్య గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసారు రేణు. ఆద్య కొన్నిసార్లు తన నానమ్మ, నాన్నల మాదిగా ఉంటుందన్న రేణు, నవ్వుతున్న ఎమోజిలను పోస్ట్ చేసారు. అలానే నా కెమెరా ఫేవరెట్ పర్సన్ ఆద్యనే అని కూడా రేణు చెప్పడం జరిగింది. కాగా పవన్ తో కలసి ఆద్య దిగిన ఆ ఫోటో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది…..!!

Read more RELATED
Recommended to you

Latest news