SSMB28 : మహేష్ బాబుతో పెళ్లి సందD హీరోయిన్ రొమాన్స్ !

-

అతడు, ఖలేజా చిత్రాలతో టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా నిలిచారు నటుడు మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న మూడో చిత్రం #SSMB28 (వర్కింగ్‌ టైటిల్‌) ప్రకటన వెలువడటమే ఆలస్యం సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.

వీరి కాంబినేషన్ లో రానున్న పాన్ ఇండియా చిత్రం పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ఇందులోని ఓ నెగిటివ్ పాత్ర కోసం ఇటీవల ‘పొన్నియన్ సెల్వన్’ లో నటించి మెప్పించిన మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మీని సంప్రదించారట.

అలాగే ఈ సినిమాలో శ్రీలీల సెకండ్‌ హీరోయిన్‌ గా నటిస్తున్నారట. ఒక టాక్ క్రేజీ హీరోయిన్ అయిటమ్ సాంగ్ కూడా ఉందని సమాచారం. అంతేకాదు, సీనియర్ హీరోయిన్ స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉందని టాక్‌. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.

Read more RELATED
Recommended to you

Latest news