Adipurush : దిల్లీ కోర్టులో ‘ఆదిపురుష్’ సినిమాకు ఊరట

-

పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్​ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’​ సినిమాకు దిల్లీ కోర్టులో ఊరట లభించింది. ఆ సినిమా విడుదలను నిలుపుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్​ను అడ్వకేట్ రాజ్ గౌరవ్ ఉపసంహరించుకున్నారు. ‘సినిమా విడుదల పోస్ట్ పోన్​ అయింది. నేను అభ్యంతరం వ్యక్తం చేసిన వాటిపై చిత్ర యూనిట్​ స్పందించింది. సినిమాలో అవసరమైన మార్పులు చేస్తున్నట్లు నాకు తెలిసింది. అందుకే ఇంజక్షన్ పిటిషన్​ను వెనక్కు తీసుకుంటున్నాను’ అని పిటిషనర్​ కోర్టుకు తెలిపినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే జడ్జి ఈ పిటిషన్​ను కొట్టివేశారు.

అసలేం జరిగిందంటే.. ‘ఆదిపురుష్​’ సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ గతేడాది దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. రాముడు, హనుమంతుడిని తోలు పట్టీలు ధరించి అసమంజసమైన ధోరణిలో చూపించారని పిటిషనర్లు ఆరోపించారు. రావణుడ్ని కూడా తప్పుగా చూపించారని అందులో పేర్కొన్నారు. రామాయణ పురాణాన్ని వక్రీకరించారని ఆదిపురుష్​ అడ్వకేట్​ రాజ్​ గౌరవ్​ కోర్టులో పిటిషన్ వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news