వైఎస్ జగన్ బయోపిక్.. డైరక్టర్ ఎవరంటే..!

-

బయోపిక్ సినిమాల హవా నడుస్తున్న ఈ తరుణంలో ఇప్పటికే ఎన్.టి.ఆర్, వైఎస్సార్ బయోపిక్ లు ప్రేక్షకుల ముందుకు వస్తుండగా కొత్తగా యువనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ కు శ్రీకారం చుడుతున్నారట. మరో మూడు నెలల్లో ఏపి ఎలక్షన్స్ ఉన్న కారణంగా వైఎస్ జగన్ బయోపిక్ చేస్తున్నాడట ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి.

రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి సరిగ్గా ఎన్నికలకు 15 రోజులు ముందు ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఈమధ్య సిని సెలబ్రిటీస్ కొంతమంది జగన్ ను కలవడం ఆయనకు సపోర్ట్ గా నిలుస్తామని చెప్పడం చూస్తూనే ఉన్నాం. కమెడియన్ ఆలి, థర్టీ ఇయర్స్ పృధ్వి, పోసాని కృష్ణమురళి డైరెక్ట్ గా జగన్ ను కలిసి తమ సపోర్ట్ అందించారు. పోసాని మరో అడుగు ముందుకేసి జగన్ బయోపిక్ ను తీస్తానని ప్రకటించారు.

మరి ఈ బయోపిక్ పక్కా పొలిటికల్ స్టంట్ గా అనిపిస్తున్నా వైఎస్ జగన్ కు ఈ బయోపిక్ ఏమాత్రం ఉపయోగపడుతుందో చూడాలి. ఈ సినిమాలో నటీనటులు మిగతా విషయాలు త్వరలో వెళ్లడవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news