రికార్డులు క్రియేట్ చేస్తున్న ప్రభాస్ “ఆదిపురుష్” ట్రైలర్

-

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఆది పురుష్. మైథాలజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడి పాత్రలో దేవ్ దత్త నగే నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.

సాచెట్ – పరంపర ఆది పురుష్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ లేటెస్ట్ పాన్ ఇండియా సెన్సేషనల్ మూవీ ఆది పురుష్ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా.. తాజాగా ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఈ ట్రైలర్ మొత్తం 3 నిమిషాల 20 సెకండ్లు ఉంది. సీతను రావణుడు అపహరించడంతో మొదలుపెట్టి రాముడి ఆగమనం, అయోధ్య పరిచయం.. ఇలా కొనసాగించి చివరికి రామ రావణ యుద్ధం షాట్లతో ముగించారు. ఈ ట్రైలర్ లోని విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్నాయి.

టీజర్ చూసినప్పుడు ఏదైతే నెగిటివ్ ఫీలింగ్ వచ్చిందో అది పూర్తిగా తొలగిపోయేలా బ్రహ్మాండంగా కట్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ప్రేక్షకులతో జైశ్రీరామ్ అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తున్నంత సేపు డివోషనల్ మూడ్ లోకి తీసుకువెళ్ళింది. అంతేకాదు ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ తో యూట్యూబ్ షేక్ అయింది. హిందీ ట్రైలర్ కు 25 నిమిషాలు, తెలుగు ట్రైలర్ కు 31 నిమిషాలలోని 10 లక్షల వ్యూస్ రావడం విశేషం. అతి తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ సొంతం చేసుకుంది ఆదిపురుష్ ట్రైలర్.

Read more RELATED
Recommended to you

Latest news