దక్షిణాదిలో ఏ హీరో చేయని సాయం చేసిన ప్రభాస్…!

-

కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గాను ఇప్పుడు సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా తమ వంతుగా ఆర్ధిక సాయం చేస్తున్నారు. ఎక్కడిక్కడ ప్రజల కోసం భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు సినీ ప్రముఖులు. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలు అందరూ కూడా సాయం చేసారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, తాజాగా ప్రభాస్… సాయం చేయడానికి ముందుకి వచ్చారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధాన మంత్రి సహాయ నిధికి తమ వంతుగా సహాయం చేయడానికి ముందుకి వచ్చి భారీ విరాళాలు ప్రకటించారు. ప్రధాన మంత్రి సహాయ నిధికి కూడా రూ. 3 కోట్ల విరాళం అందించాడు ప్రభాస్ ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ వాళ్లు కరోనా క్రైసిస్ ఛారిటీకి రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. టాలీవుడ్ కార్మికుల సహాయార్ధం మరో రూ.50 లక్షల విరాళం ప్రకటించాడు.

మొత్తం ప్రభాస్ కరోనా కోసం అని… 4.5 కోట్ల విరాళం ప్రకటించాడు. దక్షిణాదిలో ఏ ఒక్క స్టార్ హీరో కూడా ఈ స్థాయిలో విరాళం ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్ రెండు కోట్లు ప్రభాస్ తర్వాతి స్థానంలో ఉండగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 25 కోట్లు ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఇదే ఇప్పటి వరకు అత్యధికం. ఏది ఎలా ఉన్నా ప్రభాస్ ఇలా ముందుకి రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news