సలార్: ప్రశాంత్ నీల్ కామెంట్లతో ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం..

-

కేజీఎఫ్ సినిమాతో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్న ప్రశాంత్ నీల్, తన తర్వాతి చిత్రాన్ని పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సలార్ పేరుతో ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది. ఇటీవలే ఇందులో నటించే హీరోయిన్ శృతి హాసన్ అని ప్రకటించారు. ఐతే సలార్ సినిమా కథపై అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ఒకటి, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన మొదటి సినిమా ఉగ్రం కి సలార్ రీమేక్ అని పాన్ ఇండియా కోసం ఇలా చేస్తున్నారని అన్నారు.

ఈ విషయమై నోరు విప్పిన ప్రశాంత్ నీల్, సలార్ సినిమా ఏ సినిమాకీ రీమేక్ కాదనీ, ఉగ్రం సినిమాని రీమేక్ చేసే ఉద్దేశ్యమే లేదనీ, ప్రభాస్ కోసమే రాసుకుని, ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్న చిత్రమని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చిత్రీకరణ మొదలుపెట్టి, సెప్టెంబర్ -అక్టోబర్ కల్లా పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలిపేందుకు చూస్తున్నామని అన్నాడు. దీంతో ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగింది.

Read more RELATED
Recommended to you

Latest news