‘మహానటి’ దర్శకుడికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన ప్ర‌భాస్‌.. నెక్ట్స్ సినిమా ఆయ‌న‌తోనే..!!

-

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన 20వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతోంది. పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ కి ‘రాధే శ్యామ్’ అనే పేరును పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ జోడీగా పూజా హెగ్డే అలరించనుంది. ఈ చిత్రం వచ్చే యేడాది సమ్మర్‌లో విడుదల కానుంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ ఏ దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇద్దరు .. ముగ్గురు దర్శకుల పేర్లు వినిపించాయి. ఆ పేర్ల సంగతి అటుంచితే, తాజాగా నాగ్ అశ్విన్ పేరు తెరపైకి వచ్చింది.

‘మహానటి’ సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేసిన నాగ్ అశ్విన్, అప్పటి నుంచి ఒక కథపై కసరత్తు చేస్తూ వస్తున్నాడు. ఇటీవల ఆయన ఆ కథను ప్రభాస్ కి వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయట. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో ఈ సినిమా రూపొంద‌నుంది. బుధ‌వారం సినిమాను అధికారికంగా ప్ర‌క‌టించారు. సైన్స్ ఫిక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ప్రారంభం కానుంది. త్వ‌ర‌లోనే మిగ‌తా వివ‌రాల‌ను ప్ర‌క‌టించేలా ఉన్నారు. ఇక ప్రభాస్‌తో కలిసి నాగ్ అశ్విన్‌ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news