ప్రభాస్ మూవీ బడ్జెట్ 500 కోట్లా…?

-

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ చేసే సినిమాలు అన్నీ కూడా భారీ బడ్జెట్ తో వస్తున్న సంగతి తెలిసిందే. సాహో సినిమా కూడా భారీ బడ్జెట్ తో వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. అయినా సరే ప్రేక్షకులు ఈ సినిమాను అంతగా ఆదరించలేదు. మన తెలుగులో కాకుండా ఇతర భాషల్లో ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో వస్తున్న సంగతి తెలిసిందే. తర్వాత ప్రభాస్ మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీ బ్యానర్ లో అశ్విని దత్ నిర్మాతగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో వస్తుంది. నాగ్ అశ్విన్ ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసారని సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు క్యాస్టింగ్ కూడా భారీగా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

ఈ మూవీ బడ్జెట్ రూ. 500 కోట్లకు పైగానే ఉంటుంది అని సమాచారం. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత విదేశాల్లో ఈ సినిమాలో షూటింగ్ చేస్తారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీయన్స్‌ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ మూవీ షూటింగ్‌ను ప్రార౦భించి ఏడాది చివర్లో విడుదల చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. ఈ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్ అని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news