PRABHAS : వైరల్ గా మారిన ప్రభాస్ లేటెస్ట్ లుక్స్.!

-

వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేసిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘సీతా రామం’. ఇందులో హీరోగా మాలీవుడ్(మలయాళం)మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించారు. అయితే.. నిన్న సీతారామం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభాస్‌ ముఖ్య అతిధిగా పాల్గొని, మాట్లాడారు.

ఈ సందర్భంగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని సినిమాలు థియేటర్ లోనే చూడాలని కోరారు. సీతా రామం సినిమాని థియేటర్ లోనే చూడాలని విజ్క్షప్తి చేశారు ప్రభాస్‌. ఇంట్లో దేవుడు వున్నాడు అని గుడికి వెళ్ళడం మనేస్తామా ….ఇది అంతేనని.. మాకు థియేటర్స్ గుడులు లాంటివని పేర్కొన్నారు ప్రభాస్‌.

తప్పకుండా సినిమాని థియేటర్ లో చూడండని కోరారు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్. అనంతరం స్వప్న దత్ మాట్లాడుతూ.. ప్రభాస్ సాధారణంగా బయటకు రారని.. ఒకటి మా కోసం వచ్చారు …రెండు సినిమాని బతికిద్దామని వచ్చారని వెల్లడించారు.

జనాన్ని థియేటర్ కు రప్పించడానికి ఇక్కడకు వచ్చారని స్వప్న దత్ స్పష్టం చేశారు. కాగా సీతారామం సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ లో ప్రభాస్‌ అంట్రాక్షన్‌ గా నిలవగా.. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news