ప్రేక్షకులను మేమే చెడగొట్టాం.. దిల్‌రాజు వ్యాఖ్యలపై బన్నీ వాస్‌ రియాక్షన్?

-

నాలుగు వారాలకే ఓటీటీలోకి సినిమా రావడంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకులు థియేటర్‌కు రాకుండా తామే చెడగొట్టామని ఆయన అన్నారు. దీనిపై  నిర్మాత బన్నీ వాస్‌ స్పందించారు.

‘మీరు ఇంట్లో కూర్చోండి నాలుగు వారాలకే  ఓటీటీలో మూవీ తీసుకొస్తాం’ అని దిల్‌రాజు అన్న వ్యాఖ్యలపై బన్నీ వాసు స్పందిస్తూ ఎవరెన్ని బాధలు పడినా, ఏం చేసినా చిత్ర పరిశ్రమలో ఐక్యత లేకపోతే ఏం చేయలేమని వ్యాఖ్యానించారు. ఛాంబర్‌, లేదా ఇంకెవరైనా రూల్స్‌ పెడితే, ఇది సక్సెస్‌ అయ్యేది కాదని పేర్కొన్నారు. ఎగ్జిబిటర్స్‌, ప్రొడ్యూసర్స్‌ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని.. 8 వారాల కన్నా ముందే సినిమా ఓటీటీలో విడుదల చేస్తే, థియేటర్లు ఇవ్వమని బాలీవుడ్‌ తీసుకున్న కఠిన నిర్ణయాలను ఇక్కడా అమలు చేయాలని బన్నీ వాసు చెప్పుకొచ్చారు.

కొత్త సినిమాలకు ప్రేక్షకులకు ఆశించినంత స్థాయిలో రాకపోవడంపై బన్నీ వాసు స్పందిస్తూ.. థియేటర్‌కు జనం రావాలంటే, ఏదైనా సందర్భం ఉండాలని అన్నారు. ఒక మూడ్‌ క్రియేట్‌ అయితే తప్ప ప్రేక్షకులు రారని ఆయ్ మూవీ సక్సెస్ మీట్ సందర్భంగా బన్నీ వాసు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news