‘గుంటూరు కారం’ చివరి 45 నిమిషాలు వేరే లెవెల్లో ఉంటది : నిర్మాత నాగవంశీ

-

సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’ . త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్స్ షురూ చేసింది. తరచూ అప్డేట్స్ ఇస్తూ సినిమాపై ప్రేక్షకులకు అంచనాలు పెంచుతోంది. మరో మూడ్రోజుల్లో ట్రైలర్ రిలీజ్ కూడా చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేసి అందులోనే ట్రైలర్ రిలీజ్ చేయాలని యోచిస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మహేశ్‌ అభిమానులతో సోషల్‌మీడియా వేదికగా మాట్లాడుతూ ఓ క్రేజీ న్యూస్ చెప్పారు. ఈ సినిమాలో చివరి 45 నిమిషాలు అదిరిపోతుందని అన్నారు. ఫైట్ సీక్వెన్సులు, ఎమోషనల్ సీన్స్, కుర్చీ సాంగ్ ఈ సినిమాను ఓ రేంజ్కు తీసుకెళ్లిందని తెలిపారు. ఇవన్నీ ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారని వెల్లడించారు. సంక్రాంతికి ఈ సినిమా పర్ఫెక్ట్ అని చెప్పుకొచ్చారు. ఫసాఫ్ట్‌లో వచ్చే ఫైట్‌లో ఇద్దరు సూపర్‌స్టార్స్‌ను చూస్తున్న ఫీల్‌ కలుగుతుందని సినిమాపై మరింత క్యూరియాసిటీని క్రియేట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news