అనురాధ ఇంటర్నేషనల్ టింబర్ డిపోను సందర్షించిన బండి సంజయ్

-

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్  ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ న్యూ బోయినిపల్లిలోని అనురాధ ఇంటర్నేషనల్ టింబర్ డిపోను సందర్శించారు.  అయోధ్య రామ మందిరం నిర్మాణానికి అవసరమైన  తలుపులు, ఇతర కలప వస్తువులను అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు తయారు చేస్తున్నారు. అయితే వీటిని బండి సంజయ్ పరిశీలించారు. అనంతరం నిర్వాహకులతో మాట్లాడారు. 

ప్రధానంగా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జనవరి 22న అంగరంగ వైభవంగా జరుగనున్న విషయం తెలిసిందే. ఇటీవలే అయోధ్య రామ మందిరం గుర్భగుడి ఫోటోలను ట్రస్ట్ సెక్రెటరీ చంపత్ రాయ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దశాబ్దాల సమస్య తీరిపోయి అయోధ్యలో దివ్యమైన రామ మందిర నిర్మాణం శరవేగంగా జరిగింది. ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ సన్నాహాలను చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news