పునీత్ రాజ్ కుమార్ ‘జేమ్స్’ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

-

కన్నడ పవర్ స్టార్, దివంగత పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా ‘జేమ్స్’. ఈ సినిమా డబ్బింగ్ దశలో ఉన్నప్పుడే పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో మరణించారు. పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం యావత్ కర్ణాటకను శోకసంద్రంలో ముంచింది. తమ అభిమాన హీరో పునీత్ ఇక లేరని కర్ణాటక ప్రజలు తీవ్ర ఆవేదన చెందారు. మార్చి 17న విడుదలైన తన అభిమాన హీరో చివరి సినిమా ‘ జేమ్స్’ కు పెద్ద ఎత్తున జనం నీరాజనాలు పలికారు. జేమ్స్ విడుదలైన అన్ని థియేటర్లను దేవాలయాల్లాగా ముస్తాబు చేశారు. తమ అభిమాన హీరోను చివరి సారిగా తెరపై చూస్తున్నామని తెలిసి.. ప్రేక్షకులు కన్నీళ్లు పెడుతూనే సినిమా చూశారు. సినిమాను పెద్ద హిట్ చేశారు. 

ఇదిలా ఉంటే పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ‘జేమ్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఏప్రిల్ 14న సోనీ లివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, కన్నడ, తమిళ్, మళయాళం, హిందీ భాషల్లో జేమ్స్ ను విడుదల చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news