తనయుడితో పూరి ‘వాస్కోడగామా’

-

స్టార్ డైరక్టర్ పూరి జగన్నాథ్ తనయుడిని హీరోగా పెట్టి చేసిన మెహబూబా కూడా నిరాశపరచింది. దర్శక నిర్మాతగా వరుసగా ఫెయిల్యూర్ అవుతున్న పూరి జగన్నాథ్ ఈసారి నిర్మాతగా మాత్రమే తనయుడితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు పూరి అసిస్టెంట్ అనీల్ డైరక్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తుందట.

సినిమా టైటిల్ గా వాస్కొడగామా అని రిజిస్టర్ చేయించాడట పూరి జగన్నాథ్. పూరి కనెక్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాను పూరి నిర్మిస్తున్నారు. సహ నిర్మాతగా చార్మి ఉంటుంది. ఈ సినిమా కోసం కొత్త వాళ్లకు అవకాశాలు ఇస్తున్నారు. పూరి వాస్కోడగామా కచ్చితంగా పూరి ప్రొడక్షన్ రేంజ్ ఏంటో చూపిస్తుందని అంటున్నారు. పూరి మాత్రం ఇప్పుడప్పుడే డైరక్షన్ జోలికి వెళ్లే పరిస్థితి కనబడటం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news