రాజమౌళి మెచ్చిన గీతా గోవిందం..!

-

విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం డైరక్షన్ లో వచ్చిన గీతా గోవిందం మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇక ఈ సినిమాలో విజయ్, రష్మికల జోడి అలరించింది. సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాదు దర్శకధీరుడు రాజమౌళిని మెప్పించేసింది.

సినిమా చూసిన రాజమౌళి గీతా గోవిందం నవ్వుల హరివిల్లు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ కు ఈ సినిమా మంచి చాయిస్ అని.. తను ఏం చేస్తున్నాడో విజయ్ మంచి అవగాహనతో ఉన్నాడని అన్నారు. సినిమాలో ప్రతిది చాలా డీటైల్డ్ గా చెప్పారని.. దర్శకుడు పరశురాం బాగా హ్యాండిల్ చేశారని అని రాజమౌళి ట్వీట్ చేశారు.

రాజమౌళి ట్వీట్ తో చిత్రయూనిట్ ఆనందలో మునిగితేలుతుంది. రాజమౌళిని మెప్పించింది అంటే ఇక సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధించినట్టో అర్ధం చేసుకోవచ్చు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మిస్తున్న ఈ సినిమా విజయ్ సక్సెస్ మేనియాను కొనసాగిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news