రకుల్ ప్రీత్ సింగ్ ఎన్సీబీ ముందు హాజ‌రైంది

-

రియా చక్రవర్తి అరెస్టుతో బయ‌ట‌ప‌డిన డ్రగ్స్ కేసులో ప్రముఖ టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించ‌య‌డం టాలీవుడ్‌లో సంచ‌ల‌నంగా మారింది. అయితే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) బుధవారం రకుల్ తో పాటు మ‌రో ముగ్గురు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్‌లు దీపిక ప‌దుకోన్‌, సారా అలీఖాన్‌, శ్ర‌ద్దా కపూర్‌ల‌కు స‌మ‌న్లు అందించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స‌మ‌న్లు అందుకున్న ర‌కుల్ గురువారం ముంబై వెళ్లారు. శుక్రవారం ఎన్సీబీ అధికారుల ముందు హాజ‌ర‌య్యారు.

దీనికి సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. డ్ర‌గ్స్ కేసులో స‌మ‌న్లు అందుకున్న ర‌కుల్ గురువారం ముంబై చేరుకున్నారు. శుక్రారం ఉద‌యం వైట్ ష‌ర్ట్‌, బ్లూ జీన్స్, క‌ళ్ల‌కు బ్లాక్ గాగుల్స్‌, ముఖానికి ఎన్ 95 మాస్క్ ధ‌రించి ఎన్సీబీ అధికారుల ముందు ప్ర‌త్య‌క్ష్య‌మైంది. బ‌ల్లార్ద్ ఎట్ఏట్ వ‌ద్ద వున్న ఎన్సీబీ గెస్ట్ హౌస్‌లో ర‌కుల్ విచార‌ణ‌కు హాజ‌రైన‌ట్టు తెలుస్తోంది.

ర‌కుల్‌తో పాటు నటి దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్‌ను కూడా ఎన్‌సిబి ప్రశ్నిస్తోంది. రియా చక్రవర్తి వాట్సాప్ చాట్ ఆధారంగా ర‌కుల్ కు ఎన్సీబీ అధికారులు స‌మ‌న్లు జారీ చేసిన‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  ఈ కేసులో దీపికా పదుకొనేను శనివారం ప్రశ్నించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news