సైరా యూనిట్ కు చరణ్ వార్నింగ్..!

-

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాగా వస్తున్న సైరా నరసింహ రెడ్డి సినిమా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కున్న విషయం తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమా 200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించబడుతుంది. అయితే ఈ సినిమా అనుకున్న డేట్ కు పూర్తి చేయడంలో డైరక్టర్ సురేందర్ రెడ్డి అండ్ టీం విఫలమవుతున్నారట. అందుకే నిర్మాత చరణ్ వారికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఇక అసలు లేట్ చేయడకుండా సినిమా పూర్తి చేసే వరకు కష్టపడాల్సిందే అంటున్నాడట. అసలైతే సమ్మర్ రేసులో ఉంటుందని భావించిన సైరా సినిమా దసరాకి వాయిదా పడింది. అప్పటికైనా అందుతుందా లేదా అన్న డౌట్ వస్తుంది. అందుకే నిర్మాత చరణ్ సైరా యూనిట్ అందరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి త్వరలోనే సినిమా పూర్తి చేయమని అన్నాడట. చిరంజీవితో పాటుగా ఈ సినిమాలో అమితాబ్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version