హైదరాబాద్ గోకుల్ థియేటర్లో కొత్త అవ‌తారం ఎత్తిన రాశీ ఖన్నా

-

ప‌బ్లిసిటీ ప‌లు ర‌కాలు. ఏదో రూపంలో ప‌బ్లిసిటీ తెచ్చుకుంటే చాలు. అందుకోసం ఏం చేసినా ఫ‌ర్వాలేదు. అందులో భాగంగానే థియేట‌ర్ కౌంట‌ర్లో టికెట్లు అమ్మ‌డానికి సిద్ధ‌మైంది రాశీఖ‌న్నా తాజాగా ప్రతిరోజూ పండగే చిత్రం కోసం హీరోయిన్ రాశీ ఖన్నా కూడా రంగంలోకి దిగింది. సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబరు 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్ జరుగుతుండడంతో రాశీ ఖన్నా హైదరాబాదులోని గోకుల్ థియేటర్ లో టికెట్లు విక్రయించారు.

రాశీ ఖన్నా బుకింగ్ కౌంటర్ లో ఉందన్న విషయం ఆనోటా ఈనోటా పాకిపోవడంతో కుర్రకారు గోకుల్ థియేటర్ కు పోటెత్తింది. రాశీ ఎంతో ఓపిగ్గా అభిమానులకు టికెట్లు అమ్ముతూ తన చిత్రానికి పబ్లిసిటీ చేసుకుంది. అయితే ఈ ఐడియా ఏమీ కొత్త‌ది కాదు. ఇది వ‌ర‌కు చాలా మంది ట్రై చేసిన‌దే. మొన్న‌టికి మొన్న `మీకు మాత్ర‌మే చెబుతా` ప్ర‌మోష‌న్ కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఇదే ప్లాన్ వేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news