స్వీయ నిర్భందంలో రష్మీ.. ఫస్ట్ డే ఎలా గడిచిందంటే..?

-

కరోనా వైరస్‌కు భయపడి జనమంతా స్వీయ నిర్భందంలోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో సినీ ప్రముఖులు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడైతే కరోనా వ్యాప్తి చెందిందో అప్పటి నుంచే ఇంటికే పరిమితమయ్యారు. మరికొంత మంది ఇలాంటి వాటిని లెక్కచేయకుండా వారి పనులు చూసుకున్నారు.

కరోనా కేసులు నానాటికి పెరిగిపోతూ ఉండటంతో జన సమూహాలుండే ప్రదేశాలను మూసి వేయాలని ఆదేశించింది. థియేటర్స్, మాల్స్, ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, పబ్స్, క్లబ్స్ ఇలా ప్రతీ ఒక్కదాన్ని మార్చి 31వరకు మూసి వేయాలని ఆదేశించింది. అందులో భాగంగానే టాలీవుడ్‌లో జరిగే అన్ని రకాల షూటింగ్స్‌ను రద్దు చేయాలని సినీ పెద్దలు నిర్ణయించారు.

అయితే ఈ నిర్ణయంపై యాంకర్ రష్మీ ఫైర్ అయింది. ముందుగా అనుకున్న కార్యక్రమాలను ఎలా వాయిదా వేయగలమని ప్రశ్నించింది. అందులో భాగంగానే రష్మీ కూడా రెండు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్‌లోనూ పాల్గొంది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. కరోనా విజృంభిస్తున్న సమయంలో షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఏంటని రష్మీపై ఆగ్రహం వ్యక్తం చేశారు నెటిజన్స్.

అయినా సరే ఆమె ముందుగా ఇచ్చిన కమిట్మెంట్ మేరకు వెళ్లానని తెలిపింది. అయితే ఆమె తన వ్యవహారాలన్ని చక్కబెట్టుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా స్వీయ నిర్భందంలోకి వెళ్లింది. మొదటి రోజు ఎలా గడిచిందో తెలిపింది. తన కుక్క పిల్లతో సరదాగా గడిపినట్టు తెలుస్తోంది. ఈ మేరకు షేర్ చేసిన ఫోటో ఆకట్టుకుంటోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news