గీతని అసలు వదలట్లేదు..!

-

కన్నడ బ్యూటీ కిరాక్ పిల్ల రష్మిక మందన తెలుగులో ఫుల్ స్వింగ్ లో ఉంది. ఛలో, గీతా గోవిందం, దేవదాస్ ఇలా చేసిన 3 సినిమాల్లో రెండు సూపర్ హిట్లు కొట్టగా ఒకటి యావరేజ్ గా ఆడింది. యూత్ లో రష్మికకు ఏర్పడిన ఫాలోయింగ్ ను చూసి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న రష్మిక ఆ సినిమా తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబో సినిమా చేస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత మెగా హీరోతో రొమాన్స్ కు రెడీ అవుతుందట రష్మిక. మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రలహరి సినిమా తర్వాత పరశురాం డైరక్షన్ లో సినిమా చేయాలని చూస్తున్నాడు. ఆ సినిమాలో రష్మిక హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ -2 బ్యానర్ నిర్మిస్తుందట. మెగా హీరోతో ఒక హిట్ పడితే ఇక వరుసగా ఆ హీరోలే అమ్మడికి ఛాన్స్ ఇస్తారు. ఎలా లేదన్నా రష్మిక తెలుగులో స్టార్ రేంజ్ అందుకోవడం మాత్రం ఖాయమని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news