పొగడ్తలతో కీర్తి సురేష్ ని మోసేసిన రష్మిక ..!

-

కీర్తి సురేష్ నటించిన ‘పెంగ్విన్‌’ రీసెంట్ గా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్ బ్యాగ్డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాకి ఈశ్వర్ కార్తీక్ ‌దర్శకత్వం వహించాడు. ప్రముఖ దర్శక, నిర్మాత కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాని నిర్మించాడు. కేవలం 35 రోజుల్లో చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమాలో కీర్తి సురేష్ గర్భిణి స్త్రీ పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకి ముందు నుంచి మంచి అంచనాలు నెలకొనగా ఆ అంచనాలను కీర్తి సురేష్ అందుకుంది.

 

ముఖ్యంగా కీర్తి సురేష్ నటన.. ఈశ్వర్ కార్తీక్ మేకింగ్ కి తెలుగు తమిళ ప్రేక్షకుల్లో ఇండస్ట్రీ వర్గాలలో ప్రశంసలు దక్కాయి. ఈ నేపథ్యంలో ‘పెంగ్విన్‌’ సినిమా చూసిన రష్మిక చిత్ర యూనిట్ ని మెచ్చుకుంటూ ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్‌ పెట్టింది. ‘పెంగ్విన్‌’ చూశాను కీర్తి.. నీ నటన మర్చిపోలేకపోతున్నాను… నువ్వు చాలా అద్భుతంగా నటించావు. నీకు..దర్శకుడు ఈశ్వర్‌ కార్తిక్‌, నిర్మాత కార్తిక్‌ సుబ్బరాజుతోపాటు ఇతర చిత్రబృందానికి అభినందనలు’ అని రష్మిక ట్వీట్ చేసింది.

 

మహానటి సినిమా తరువాత మళ్ళీ ఇన్నాళ్ళకు కమర్షియల్ సినిమా అని ఆలోచించకుండా ‘పెంగ్విన్‌’ ని ఒప్పుకొని అందరికీ షాకిచ్చింది. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ లేడీ ఓరియెంట్ గా రూపొందే సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగానే మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ చిత్రాలు కమిటయింది.

అయితే కొంతమందిని మాత్రం పెంగ్విన్ సినిమా నిరాశ పరచింది. అంతేకాదు తన నెక్స్ట్ సినిమాలకి కూడా ఇలాంటి రిజల్ట్ వస్తే మాత్రం కీర్తి సురేష్ కెరీర్ కి ఇబ్బందే అన్న టాక్ కూడా వస్తోంది. దాంతో సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురాం కాంబినేషన్ లో రూపొందే సర్కారు వారి పాట లో కీర్తి ని తీసుకోవాలంటే ఆలోచిస్తున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని ఇపటి నుంచైనా కమర్షియల్ సినిమాలకి ప్రిఫరెన్స్ ఇస్తే మంచిదేమో.

Read more RELATED
Recommended to you

Latest news