ఐశ్వర్య రాజేశ్​కు సపోర్ట్​గా రష్మిక పోస్టు

-

‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన్న పోషించిన శ్రీవల్లి పాత్ర తనకు బాగా సూటయ్యేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నటి ఐశ్వర్య రాజేష్‌ అన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్​లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ విషయంలో ఇటు ఐశ్వర్య.. అటు రష్మిక ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేసుకుంటున్నాయి. ఓ క్రమంలో ఐశ్వర్య మీదకు రష్మిక ఫ్యాన్స్ తెగ ఫైర్ అయ్యి ట్రోలింగ్ కూడా మొదలు పెట్టారు. అయితే ఈ వివాదానికి ముగింపు పలుకుతూ ఇద్దరు హీరోయిన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

తన మాటల్ని కొందరు వక్రీకరించారని, రష్మిక మందన్నను కించపరిచేలా తాను ఎక్కడా మాట్లాడలేదని ఐశ్వర్య రాజేష్‌ పేర్కొంది. ‘పుష్ప’ చిత్రంలో రష్మిక మందన్న నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని, అసత్య ప్రచారాలతో ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించొద్దని ఐశ్వర్య రాజేష్‌ తన అభిమానులకు విజ్ఞప్తి చేసింది.

దీనిపై రష్మిక మందన్న స్పందిస్తూ ‘ఈ వివాదం కాస్త ఆలస్యంగా నా దృష్టికి వచ్చింది. ఐశ్వర్య..నువ్వేమిటో నాకు తెలుసు. నీ మాటల్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నా. నువ్వు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ మీద నాకు గొప్ప గౌరవం ఉంది. ‘ఫర్హానా’ చిత్రంలో నీ నటన అద్భుతంగా ఉంది’ అంటూ ప్రశంసలతో ముంచెత్తింది.

Read more RELATED
Recommended to you

Latest news