నిర్మాతగా మారనున్న ఖిలాడీ..!

-

మాస్ మహారాజ రవితేజకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కరెక్ట్ సినిమా పడాలే గానీ.. రికార్డులు తిరగరాస్తాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా.. తన ట్యాలెంట్ ను నమ్ముకుని స్టార్ హీరోగా ఎదిగాడు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఒంటరిగా స్టార్ హీరో స్థాయికి ఎదిగింది రవితేజనే. ఎనర్జిటిక్ డైలాగులతో, తనదైన మేనరిజంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు మాస్ మహారాజ. ఇక కొంత కాలంగా వరుస ప్లాపులతో సతమతమైన రవితేజ క్రాక్ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాడో చూశాం. ఇక ప్రస్తుతానికి ఖిలాడీ సినిమాతో బిజీగా ఉన్న ఈ హీరో..

మరో ప్రాజెక్టును కూడా లైన్ లో పెట్టాడు. ఇప్పటి వరకు హీరోగానే చేస్తున్న రవితేజ త్వరలో నిర్మాత అవతారం ఎత్తనున్నాడనే వార్తలు సినీ వర్గాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే చలామంది హీరోలు నిర్మాతలుగా మారి తమ ట్యాలెంట్ ను నిరూపించకున్నారు. చిన్న హీరోలు సైతం వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అలాంటిది పెద్ద హీరో అయిన మాస్ మహారాజ కాస్త లేటుగా ఈ బిజినెస్ లోకి వస్తున్నాడు.

ఇంత‌కీ ఈ ఖిలాడీ ఏ సినిమా చేయబోతున్నాడు? ఏ హీరోతో చేస్తాడు? అనే క‌దా మీ డౌటు. మన హీరోలందరూ ఎక్కువగా తెలుగు సినిమా నటులతోనే సినిమాలు నిర్మిస్తుండగా.. రవితేజ మాత్రం తన మొదటి సినిమాను ఓ మ‌ల‌యాళ హీరోతో చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీ రెండు భాష‌ల్లో తెరకెక్కుతుందట. దీనికి స్వయంగా ర‌వితేజనే దగ్గరుండి అన్ని పనులు చూసుకోనున్నట్టు తెలుస్తోంది. చిన్న బ‌డ్జెట్ సినిమాలు, ఓటీటీ ప్రాజెక్టులతోపాటు సిల్వ‌ర్ స్క్రీన్ మూవీస్ కూడా చేయాల‌ని ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం. మ‌రి మాస్ హీరోగా ఎనలేని అభిమానులను సంపాదించుకున్న ఈ విక్రమార్కుడు నిర్మాత‌గా మారి ఎలాంటి స‌క్సెస్ ను అందుకున్నాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news