బేగంబజార్ లో టీఆర్ఎస్ లీడర్ రచ్చ రచ్చ.. పోలీసులకు ఫిర్యాదు !

-

హైదరాబాద్ బేగం బజార్ దళ్ మండిలో టిఆర్ఎస్ నాయకురాలు శాంతి దేవి హల్ చల్ చేశారు. నిన్న రాత్రి 8 గంటలకు షాప్లు క్లోజ్ చేయాలంటూ హుకుం జారీ చేశారు. ఓ ప్లైవుడ్ షాప్ మూసి వేయకపోవడంతో సదరు షాప్ యాజమాని మీద శాంతి దేవి దాడి చేశారు. దీంతో ‘నువ్వు అధికారివా ?నీకేం సంబంధం?’  అంటూ శాంతి దేవి మీద దుకాణాల యజమానులు తిరగబడ్డారు. దీంతో తనను ప్రశ్నించినందుకు శాంతి దేవి తన విశ్వరూపం చూపించారు.

షాప్ యజమానులపై దాడికి పాల్పడ్డారు. తన అనుచరులతో కలిసి రెచ్చిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై బేగం బజార్ పోలీసులకు షాప్ యజమాని ఫిర్యాదు చేశారు. దీంతో శాంతి దేవి పై 323, 290 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకు మరో కేసు నమోదు చేయనున్నారు. శాంతి దేవి తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. 

Read more RELATED
Recommended to you

Latest news