జగన్‌తో చిరంజీవి బృందం భేటీ.. RGV సంచలన వ్యాఖ్యలు.. ఆ మెగా బెగ్గింగ్ ఆపండి !

-

నిన్న ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డితో టాలీవుడ్‌ ప్రముఖులు సమావేశం అయ్యారు. టాలీవుడ్‌ స్టార్లు అయినటు వంటి చిరంజీవి, ప్రభాస్‌, జూ. ఎన్టీఆర్‌, మహేశ్‌బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, నిరంజన్‌ రెడ్డి, అలీ వంటి ప్రముఖులు సీఎం వైయస్ జగన్ తో నిన్న భేటీ అయ్యారు. అంతేకాదు… ఈ సమావేశాన్ని విజయ వంతం అయ్యేలా చర్చలు జరిపారు.

అయితే..టాలీవుడ్‌ ప్రముఖుల సమావేశంపై తన ట్విట్టర్‌ వేదికగా.. సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ సెటైర్లు వేశారు. మెగాస్టార్‌ చిరంజీవిని టార్గెట్‌ చేస్తూ.. ఈ ట్వీట్‌ చేశారు రామ్‌ గోపాల్‌ వర్మ. ” ఓ మెగా అభిమానిగా ఈ మెగా బెగ్గింగ్‌ చూసి.. చాలా హర్ట్‌ అయ్యాను” అంటూ చిరంజీవిని ట్యాగ్‌ చేసారు రామ్‌ గోపాల్‌ వర్మ.

అయితే.. ఈ ట్వీట్‌ చేసిన కొద్దిసేపటి తర్వాతనే తిరిగి ఆర్జీవీ ఆ ట్వీట్‌ ను తొలగించారు. దీంతో ఆయన తీరుపై జనాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇంతకీ ఆర్జీవీ ఎవరినీ టార్గెట్‌ చేశారని చర్చించుకుంటున్నారు. ఇక అటు మెగా ఫ్యాన్స్‌ మాత్రం.. వర్మపై మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news