ఆర్జీవీ మిస్సింగ్‌: అక్యూజ్డ్ నంబర్‌వ‌న్ ప‌వ‌నే‌!

-

వివాదాస్ప‌ద చిత్రాల ద‌ర్శ‌కుడిగా ముద్ర‌ప‌డిన రామ్‌గోపాల్‌వ‌ర్మ మ‌రో వివాదానికి తెర తీసిన విష‌యం తెలిసిందే. త‌నే న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్రం `ఆర్జీవీ మిస్సింగ్‌`. ఇంత‌కు ముందు `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`, `అమ్మ రాజ్యంలో క‌డ‌ప రెడ్లు`, ప‌వ‌ర్‌స్టార్ వంటి ఇవాదాస్ప‌ద చిత్రాల‌తో ప‌వ‌ర్‌స్టార్ ప‌న్‌క‌ల్యాణ్‌ని, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్‌ని టార్గెట్ చేసిన వ‌ర్మ తాజాగా త‌న పేరు మీదు రూపొందుతున్న సినిమాతో ఒకే సినిమాలో ముగ్గురిని టార్గెట్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ‌

`ఆర్జీవీ మిస్సింగ్‌` పేరుతో శ‌నివారం రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌పై వ‌ర్మ త‌న‌ని ఇన్నోసెంట్‌గా ప్ర‌క‌టించుకుని త‌న‌ని ఎవ‌రు కిడ్నాప్ చేశారంటే స‌స్పెక్టెడ్ విక్టిమ్స్‌గా పీకె ఫ్యాన్స్‌, మెగా ఫ్యామిలీ, మాజీ ముఖ్య‌మంత్రి మ‌రియు అత‌ని త‌న‌యుడు అని పేర్లు వేయ‌డంతో ఈ మూవీతో వ‌ర్మ మ‌ళ్లీ ర‌చ్చ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇక ఆదివారం సాయంత్రం 5 గంట‌ల‌కు పీకే లుక్‌ని రిలీజ్ చేస్తార‌ని వెల్ల‌డించిన వ‌ర్మ చెప్పిన‌ట్టే అక్యూస్డ్ నం.1 అని పేర్కొంటూ పీకే లుక్‌ని రిలీజ్ చేశాడు. ఈ చిత్రానికి సంబంధించి 3, 4, 5, 6, 7 లుక్స్ కూడా వున్నాయ‌ట‌. వాటిని వ‌రుస‌గా 5,5,7,8, 9 తేదీల్లో రిలీజ్ చేస్తాన‌ని చెప్పిన వ‌ర్మ ట్రైల‌ర్‌ని ఈ నెల 10న సాయంత్రం 5 గంల‌కు రిలీజ్ చేయ‌బోతున్నాన‌ని సోష‌ల్ మీడియా ద్వారా  ప్ర‌క‌టించాడు.

Read more RELATED
Recommended to you

Latest news