వర్మ మార్క్ నివాళి…!

-

ప్రముఖ గాయకుడు ఎస్బీ బాలు మరణం పట్ల ప్రముఖులు అందరూ కూడా స్పందిస్తున్నారు. ట్విట్టర్ సహా అనేక సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ట్విట్టర్ లో తన నివాళి అర్పించారు. విషయం జీవించడం గురించి కాదు, కానీ అతను జీవించేటప్పుడు ఆ వ్యక్తి ఇతరుల జీవితాలకు ఏమి దోహదపడ్డాడనే దాని గురించి..

ఎస్పీ బాలసూబ్రహ్మణ్యం యొక్క భౌతిక అస్తిత్వం ముగిసింది, కానీ అతని స్వరం, సంగీతం జీవించినంత కాలం జీవిస్తుంది అని వర్మ ట్వీట్ చేసారు. కాగా రేపు ఎస్పీ బాలు అంత్యక్రియలు తమిళనాడులో జరుగుతాయి. ఈ అంత్యక్రియలకు పలువురు తెలుగు ప్రముఖులు కూడా హాజరు అవుతారు. ఇక ఈ అంత్యక్రియలను ప్రభుత్వ లాంచనాలతో అక్కడి ప్రభుత్వం నిర్వహిస్తుంది అని తమిళనాడు ప్రభుత్వం ప్రకటన చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news