తెలుగు రాష్ట్రాల్లో తమిళ షూటింగ్ లు వద్దంటున్న రోజా భర్త !

-

ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా భర్త ఆర్ కె సెల్వమణి తమిళనాడులో సినీ రాజకీయం ప్రారంభించారు.ఏపీ, తెలంగాణలో తమిళ చిత్రాల షూటింగ్ లు జరుగుతున్నాయని అలా చేయవద్దని ఆయన ఉద్యమం లేవదీశారు.తమిళ సినీ కార్మికులకు పనులు ఉండడం లేదని, అగ్ర హీరోలు అందరూ హైదరాబాద్, విశాఖలో షూటింగులు చేస్తున్నారని ఆయన అంటున్నారు.ఈ అంశంపై రజనీకాంత్, విజయ్ స్పందించాలని తమిళ సినిమాల షూటింగులు చెన్నైలోనే చేయడానికి అంగీకరించారని.. కానీ అజిత్ ఇంకా స్పందించాల్సి ఉంది అంటున్నారు.కొద్ది కాలంగా తమిళ భారీ చిత్రాల షూటింగులు ఎక్కువగా హైదరాబాద్, విశాఖలోనే జరుగుతున్నాయి.

ఇది ఫేప్సీ పేరుతో ఓసినీ కార్మిక సంఘాన్ని నడుపుతున్న ఆర్ కె సెల్వమణి కి నచ్చలేదు.తన సంఘంలోని సభ్యులకు పనులు ఉండడం లేదని ఆయన వివాదం ప్రారంభించారు.తాము సినిమా షూటింగులు చేయడానికి పనికిరామా?..అంటూ ఆయన సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఏపీలో సెల్వమణి భార్య రోజా మంత్రిగా ఉన్నారు.నిజానికి దర్శకుడు అయిన ఆర్కే సెల్వమణికి షూటింగులో లొకేషన్లు ఎలా సెలెక్ట్ చేసుకుంటారో తెలుసు..కథను బట్టి షూటింగ్ చేసుకుంటారు..కానీ లేనిపోని వివాదం రేపి తెలుగు రాష్ట్రాల్లో షూటింగులు వద్దని రచ్చ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news