ట్రిపుల్ ఆర్ కథ పూర్తి కాలేదా..!

-

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీగా ఈ సినిమా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా బౌండెడ్ స్క్రిప్ట్ పూర్తి చేయలేదట. తన ప్రతి సినిమా విషయంలో కథ ముందే పూర్తి చేసి సెట్స్ మీదకు వెళ్లే రాజమౌళి ట్రిపుల్ ఆర్ కు బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా ఎలా వెళ్లాడన్నది ఆశ్చర్యకరంగా మారింది.

పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా విషయంలో రాజమౌళి ముందునుండి ఎంతో జాగ్రత్త పడుతున్నాడు. ఇంకా హీరోయిన్స్ ఫైనల్ కావాల్సి ఉన్న ఈ సినిమాలో యువ కమెడియన్ రాహుల్ రామకృష్ణ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరిలో మొదలు కానుంది. అప్పటికల్లా ట్రిపుల్ ఆర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ అవుతుందట.

Read more RELATED
Recommended to you

Latest news