కరోనా బారిన పడిన ప్రముఖ సింగర్…!

-

ప్రముఖ ఎస్ సింగర్ కుమార్ సాను అకా కేదార్నాథ్ భట్టాచార్య కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ లో ప్రకటించారు. కుమార్ సాను తన పుట్టినరోజును (అక్టోబర్ 20) లాస్ ఏంజిల్స్‌లో జరుపుకోవాలని భావించారు. భార్య సలోని మరియు కుమార్తెలు, షానన్ మరియు అన్నాబెల్‌తో కలిసి ఉండాలని ఆయన ప్లాన్ చేసారు. అతను అక్టోబర్ 14 న బయలుదేరాల్సి ఉంది.

కాని పోస్ట్ పోన్ చేసినట్టుగా ఆయన ఒక ప్రకటనలో చెప్పారు. కుమార్ సాను 90 వ దశకంలో బాలీవుడ్‌ లో ఒక వెలుగు వెలిగారు. 30 భాషలలో 21,000 పాటలను పాడిన రికార్డు ఉంది. 1993 సంవత్సరంలో, అతను ఒకే రోజులో 28 పాటలను రికార్డ్ చేసినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్స్ లో చోటు సంపాదించారు.

Read more RELATED
Recommended to you

Latest news