‘చిత్రలహరి’ పోస్టర్ అదిరింది

-

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా చిత్రలహరి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శిని, నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగి సినిమాలతో దర్శకుడితా తన సత్తా చాటిన కిశోర్ తిరుమల థర్డ్ ప్రాజెక్ట్ గా వస్తున్న సినిమా చిత్రలహరి.

ఈ సినిమా టైటిల్ పోస్టర్ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేశారు. టైటిల్ లోగో సంథింగ్ స్పెషల్ గా అనిపిస్తుంది. కన్ను రూపంలో టైటిల్ డిజైన్ చేశాడు దర్శకుడు కిశోర్ తిరుమల. ప్రస్తుతం కెరియర్ ఏమాత్రం ఆశాజనకంగా లేని సాయి ధరం తేజ్ చిత్రలహరి సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి మెగా మేనళ్లుడికి కిశోర్ అయినా హిట్ ఇస్తాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news