వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన సాయి పల్లవి.. వారందరికీ సమాధానం చెబుతా !

-

కాశ్మీర్ పండిట్ల పై టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై బిజెపి నాయకులు ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజగా స్వయంగా ఈ వివాదంపై సాయి పల్లవి స్పందించారు. విశాఖ నగరంలో విరాటపర్వం మూవీ యూనిట్ సందండి చేసింది. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా పాల్గొన్న హీరో సాయి పల్లవి.. వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించారు.

తన వాఖ్యాలు గురించి ఖచ్చితంగా సమాధానం చెబుతానని.. కాని దానికి ఇది వేదిక కాదని పేర్కొన్నారు. సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని.. ఈ స్టోరి చాల బాగా నచ్చిందని తెలిపారు. విశాఖ అందాలు చాల బాగున్నాయని కొనియాడారు. అనంతరం మూవీ డైలాగ్ చెప్పి సాయి పల్లవి అలరించారు.

1992 లో జరిగిన రాజకీయ సంఘటనలు ఆధారంగా చిత్ర తెరకెక్కించాము.. అప్పటి జరిగిన మావోయిస్టుల పోరాటాలకు సినిమాకు సంభందం ఉండదని తెలిపారు డైరెక్టర్ వేణు.ప్రేమ యుద్దం త్యాగం పై మూవీ ఉంటుందని తెలిపారు డైరెక్టర్ వేణు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా.. ప్రస్తుత సమాజ పరిస్థితులు కూడా ఇందులో కనబడతాయని చెప్పారు హీరో రానా.

Read more RELATED
Recommended to you

Latest news