సోషల్ మీడియా వల్లే సమంత- చైతూ విడిపోయారా..!!

-

టాలీవుడ్ లో అక్కినేని నాగచైతన్య,సమంత విడిపోయి ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావోస్తున్నప్పటికీ వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే ఉంటుంది. సమంత చైతన్య ఎందుకు విడాకులు తీసుకున్నారనే విషయంపై ఇప్పటికి అభిమానులకు అర్థం కావడం లేదు.కానీ తాజాగా నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. సమంతతో ఎందుకు విడిపోవలసి వచ్చింది అనే విషయంపై తెలియజేసినట్టు తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

నాగచైతన్య మాట్లాడుతూ సమంత నేను విడిపోయి రెండేళ్లు అవుతోంది. చట్టపరంగా మాకు విడాకులు వచ్చి ఏడాది మాత్రమే అవుతోంది .ప్రస్తుతం మేము ఎవరి లైఫ్ లో వారు ముందుకు వెళుతున్నాము జీవితంలో ప్రతి స్టేజిని కూడా గౌరవిస్తాను సమంత చాలా మంచి అమ్మాయి ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటానని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు కారణంగానే మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఒకరిపై ఒకరికి ఇష్టం లేనట్టుగా ప్రజలలోకి వెళ్ళింది. అదే తనకు చాలా బాధ కలిగించేలా చేసింది అని తెలిపారు నాగచైతన్య.

అంతేకాకుండా వీరిద్దరి మధ్య లేని ఒక మూడో వ్యక్తిని తీసుకువచ్చి వార్తలు రాసి తమను చాలా ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆ మూడో వ్యక్తినీ కూడా అగౌరపరిచేలా చేశారని వాక్యానించారు. ఈ విషయంపై అసలు స్పందించకూడదనుకున్నాను కానీ తమ వివాహం గురించి విడాకుల గురించి ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉంటే ఎలా అంటూ తెలియజేశారు నాగచైతన్య. ఇప్పటివరకు ఈ విషయంపై స్పందించని నాగచైతన్య తాజాగా ఇలా స్పందించడంతో ఈ కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news