`వెంకీమామ`లో గెస్ట్ రోల్‌లో రానున్న అక్కినేని కోడ‌లు..

-

వెంకటేష్, నాగచైతన్యలు హీరోలుగా సురేష్ బాబు నిర్మించిన సినిమా ‘వెంకీమామ’. కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెర‌కెక్క‌బోతున్న‌ ఈ సినిమాలో, వెంకటేశ్ సరసన పాయల్ రాజ్ పుత్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా నటించారు. అయితే ఈ సినిమాలో సమంత మెరవనుందనేది తాజా సమాచారం. ఈ సినిమాలో అతిథి పాత్రలో సమంత కనిపించనుందని అంటున్నారు. కథలో అతిథి పాత్ర కీలకం కావడం వలన, సమంత అయితే కథా పరంగాను .. క్రేజ్ పరంగాను కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఆమెను తీసుకున్నారట.

అయితే కావాలనే ఈ విషయాన్ని ఇప్పటివరకూ గోప్యంగా ఉంచారట. ఇక ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ వార్తను బయటికి వదిలినట్టుగా తెలుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమాను, ఈ నెల 13వ తేదీ.. వెంక‌టేష్ పుట్టిన రోజున‌ విడుదల చేయనున్నారు. కాగా, నిజ జీవితంలో మామా అల్లుళ్లుగా ఉన్న వెంకటేష్ – నాగ చైతన్యలు వెండితెరపై కూడా అదే పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్నమైన కథాకథనాలతో పూర్తి వినోదభరితంగా ఈ సినిమా ఉండ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news