లోకేశ్‌ను చూస్తుంటే కాళ్లు వణుకుతున్నాయ్ అంటున్న రోజా..

-

అసెంబ్లీలో టీడీపీ, వైసీసీ మధ్య మాటల మంటలు చెలరేగాయి. ప్రశ్నోత్తర సమయంలో ఇంగ్లీష్‌పై చర్చ సందర్భంగా చంద్రబాబుపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇందుకు చంద్రబాబు కూడా ఘాటుగానే బదులిచ్చారు. ఇదిలా ఉంటే.. టీడీపీ ఎమ్మెల్సీ, మాజీమంత్రి నారా లోకేశ్‌పై వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్‌పర్సన్ రోజా మరోసారి తనదైన స్టయిల్లో సెటైర్లు వేశారు. టీడీపీ నేతలు హడావిడిగా ఉదయాన్నే లోకేశ్‌తో ప్రెస్‌మీట్ పెట్టించారని ఆమె అన్నారు. లోకేశ్‌ను చూస్తుంటే… మంత్రుల కాళ్లు వణుకుతున్నాయని ఆయన చెప్పడాన్ని రోజా ఎద్దేవా చేశారు.

తనకు కూడా లోకేశ్‌ను చూస్తే నా కాళ్లు కూడా వణుకుతున్నాయని సెటైర్లు వేశారు. మంగళగిరి అని పలకడానికి లోకేశ్ ట్యూషన్ పెట్టించుకున్నారని రోజా కామెంట్ చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణను మాట్లాడనివ్వడం లేదని… చంద్రబాబు కళాకారులను అవమానిస్తున్నారని రోజా ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news