చిత్ర పరిశ్రమలో విషాదం..KGF నటుడు మృతి

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు చేసుకుంది.

శాండిల్ వుడ్ నటుడు మోహన్ జూనేజా మృతి చెందారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతు న్న మోహన్ జూనేజా… బెంగుళూరు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తన సుదీర్ఘ కెరీర్ లో హాస్యనటుడిగా తమిళం, మలయాళం, హిందీ భాషల్లో వంద సినిమాల్లో నటించారు మోహన్ జూనేజా. ఆయన బ్లాక్ బస్టర్ సినిమాలు కే జి ఎఫ్ అలాగే కే జి ఎఫ్ 2 లో కూడా సందడి చేశారు. ఇక మోహన్ జూనేజా మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news