రేపు చెన్నైలో శరత్‌బాబు అంత్యక్రియలు

-

నటుడు శరత్ బాబు భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తీసుకువచ్చారు. అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం అక్కడ ఉంచారు. దీంతో ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్ కు తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

కాగా, ఇవాళ సాయంత్రం శరత్ బాబు పార్థివదేహాన్ని కుటుంబసభ్యులు చెన్నైకి తరలిస్తారు. రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తారు. కాగా, శరత్ బాబు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు అన్నారు పోసాని కృష్ణ మురళీ. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని వెల్లడించారు. మొదటిసారి మా స్వగ్రామంలో నేను ఆయనను చూసా. ఆసుపత్రిలో శరత్ బాబు చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆయన ఆరోగ్యంపై ఆరా తీసా. క్షేమంగా కొలు కుంటారని ఆనుకున్న కానీ తుది శ్వాస విడిచారన్నారు పోసాని కృష్ణ మురళీ.

Read more RELATED
Recommended to you

Latest news