సరైన సక్సెస్ కోసం ‘సరిలేరు నీకెవ్వరు’ హీరో మహేష్, డైరెక్టర్ అనిల్ మంతనాలు….!!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే . ఇప్పటివరకు తన కెరీర్ లో ఒక్క ఫెయిల్యూర్ కూడా లేని యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో తారా స్థాయిలో అంచనాలు ఉన్నాయి. మహేష్ కూడా ఇప్పటికే రెండు వరుస బ్లాక్ బస్టర్లతో దూసుకెళ్తుండడంతో, ఆయన తప్పకుండా ఈ సినిమా ద్వారా మరొక హిట్ అందుకుని వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించడం ఖాయమని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రష్మిక మందన్న మహేష్ సరసన తొలిసారి జోడి కడుతున్న ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా ఏళ్ళ తరువాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుండడం విశేషం.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మరియి పలు రకాల పోస్టర్లతో రోజురోజుకు అంచనాలు పెంచుకుంటూ పోతున్న ఈ సినిమా నుండి, కాసేపటి క్రితం సూపర్ స్టార్ మహేష్ మరియు దర్శకుడు అనిల్ రావిపూడి సెట్స్ లో ఏదో ముఖ్యమైన సీన్ విషయమై చర్చిస్తున్న ఫోటోని తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో రిలీజ్ చేసారు సినిమా యూనిట్ వారు. ఆ సీన్ లో మహేష్ మరియు అనిల్ లను చూస్తుంటే తప్పకుండా వారిద్దరి మ్యాజిక్ వర్కౌట్ అయి, ఈ సినిమా మంచి అవుతుందనిపిస్తుందని పలువురు ఫ్యాన్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.
మహేష్ బాబు మిలిటరీ మేజర్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు కోరుకునే అన్ని రకాల అంశాలు మిక్స్ చేసి దర్శకుడు అనిల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ సినిమాలోని పాటలు అతి త్వరలో యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారట. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు…..!!

Read more RELATED
Recommended to you

Latest news